రాష్ట్రీయం

యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 26: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పదవ రోజు సోమవారం మహాపూర్ణాహుతి, సుదర్శన చక్రతీర్థం, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు శాస్తయ్రుక్తంగా అర్చక, యాజ్ఞక బృందం ఘనంగా నిర్వహించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల వీక్షణకు గరుడుడి ఆహ్వానంతో యాదాద్రికి విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ వారిని తృప్తిపరిచేలా ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతి నిర్వహించారు. శ్రీమహావిష్ణువు ప్రధాన ఆయుధం మహాసుదర్శన చక్ర ఆళ్వార్‌కు బాల ఆలయంలో చక్రతీర్థస్నానం నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం చక్రతీర్థ జలాలను కొండపైన విష్ణుపుష్కరణిలో కలుపగా భక్తు జనులు ఈ పుణ్యజలాల్లో స్నానమాచరించారు. చక్రతీర్థ జలాలను భక్తులపై చల్లి అర్చక పండితులు సంప్రోక్షణ చేశారు. యాదాద్రి భక్తుల రక్షణకు లక్ష్మీనరసింహుడు శ్రీ సుదర్శనుడిని నియమించినట్ట్టుగా స్థల పురాణం చాటుతోంది. శ్రీ చక్రతీర్ధ స్నానఘట్టం పిదప రాత్రి శ్రీలక్ష్మీనరసింహులను దశావతార స్త్రోతాలతో స్తుతిస్తూ ఇష్టమైన పూలతో శ్రీ పుష్పయాగం నిర్వహించారు. అనంతరం దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో జరిగిన ఆయా ఉత్సవాల్లో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహామూర్తి పాల్గొన్నారు. మంగళవారం పదకొండవ రోజున శ్రీ స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాలతో ఉత్సవాలు ముగుస్తాయ.

చిత్రాలు..యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి నిర్వహించిన పుష్పయాగం (పైన)
మహాపూర్ణాహుతి, శ్రీ చక్ర తీర్ధ స్నాన దృశ్యాలు