రాష్ట్రీయం

బీజేపీ మంత్రుల రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 8: రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఇద్దరు బీజేపీ మంత్రులు వైదొలిగారు. ఆ మేరకు మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు బుధవారం రాజీనామా లేఖలను సీఎం చంద్రబాబుకు సమర్పించారు. నాలుగేళ్లపాటు తమను ప్రోత్సహించి, సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాల ప్రకారమే నిర్ణయం తీసుకున్నట్లు సీఎంకు చెప్పారు. బాబు కూడా నాలుగేళ్లు బాగా పనిచేశారని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల కేంద్రం నుంచి వైదొలగాలన్న నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు. అంతకుముందు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి, రాజీనామా లేఖపై చర్చించారు. తాము మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నందుకు బాధేమీ లేదని, సంతోషంగానే వైదొలుగుతున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. నాలుగేళ్లూ రాష్ట్భ్రావృద్ధి కోసం పనిచేశామన్నారు.