రాష్ట్రీయం

ఐఏఎస్‌ల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: రాష్ట్రంలో 8మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు ఐఏఎస్‌లను ముఖ్యమంత్రి కార్యదర్శులుగా నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పశు సంవర్ధక, మత్స్యశాఖ కార్యదర్శిగా ఉన్న సందీప్‌కుమార్ సుల్తానీయా సీఎంవో
కార్యదర్శిగా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ సీఎంవో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. మేడ్చల్ జాయింట్ కలెక్టర్ కె ధర్మారెడ్డిని సంగారెడ్డి కలెక్టర్‌గా నియమించింది. ఖమ్మం జాయింట్ కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డిని జనగామ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివలింగయ్యను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. సంగారెడ్డి జాయింట్ కలెక్టర్ వి వెంకటేశ్వర్లును అదే జిల్లాకు కలెక్టర్‌గా నియమించింది. భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ డి అమై కుమార్‌ను అదే జిల్లా కలెక్టర్‌గా నియమించింది. వరంగల్ రూరల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం హరితను అదే జిల్లా కలెక్టర్‌గా నియమించి, అక్కడి ఇన్‌చార్జి బాధ్యతల నుంచి కలెక్టర్ అమ్రపాలిని ప్రభుత్వం తప్పించింది.