రాష్ట్రీయం

సిట్టింగ్‌లకే సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 106 స్థానాల్లో విజయం సాధిస్తామని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇచ్చి, వారిని గెలిపించుకుంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ రానున్న ఎన్నికలపై తాను సర్వే చేయించానని చెప్పారు. ఒక్క సంస్థతో కాదు మూడు వేర్వేరు సంస్థలతో సర్వే చేయించినా, 106 స్థానాలూ టిఆర్‌ఎస్‌కే దక్కుతాయని వచ్చిందన్నారు. ఇప్పుడు ఉన్న సిట్టింగ్‌లందరికీ తిరిగి టిక్కెట్లు ఇస్తామని, వారందరినీ గెలిపించుకుంటానని ఆయన తెలిపారు. కాబట్టి ఎవరూ అధైర్యపడరాదని, అపొహలు అవసరం లేదని ఆయన చెప్పారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలకు అందరూ హాజరుకావాలని, సభలోనే ఉండాలని ఆయన తెలిపారు. సోమవారం ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించేప్పుడు కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. సభా కాలాన్ని వృధా చేస్తే కఠినంగా వ్యవహారిస్తామన్నారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర-మల్లర రాజకీయాలను, విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టాలని ఆయన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించారు.
జాతీయ రాజకీయాల్లో..
రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. తాను ఇక్కడే ఉంటానని, అయినా జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించనున్నట్లు ఆయన తెలిపారు. భారత రాజకీయాలకు అద్భుతమైన దిశా నిర్ధేశం చూపించి, ప్రజానికీకానికి మార్గ నిర్ధేశనం చేస్తానని ఆయన అన్నారు. లేనిపక్షంలో దేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. దళితులకు, గిరిజనులకు, రైతులకు సేవ చేయాల్సిన అవసరం ఉందని లోగడ తాను ప్రధాని మోదీతో అన్నానని ఆయన చెప్పారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీ వెళతానని, రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై వత్తిడి తీసుకుని వస్తామని ఆయన తెలిపారు. అవసరమైతే పార్టీ ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొంటానని అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
chitram....
తెరాస లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్