రాష్ట్రీయం

బీజేపీతో వైసీపీ లాలూచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) మార్చి 12: వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ కేసులు నుండి బయటపడటానికే బీజేపీతో లాలూచీ పడ్డారని చీఫ్‌విప్ పల్లె రఘునాథ రెడ్డి అన్నారు.
సోమవారం ఉదయం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ టీడీపీ బీజేపీతో ఎప్పుడు తెగతెంపులు చేసుకుంటే అప్పుడు జగన్ అతుక్కుందామని చూస్తున్నాడని తెలిపారు. వైసీపీ రెండు నాల్కుల ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి జగన్ కోసమే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రాజకీయాలు చేసినా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పారు.
ప్రత్యేక హోథా ఇవ్వకపోతే జగన్ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని అంటున్నాడు, కానీ రాజీనామా చేయటం వలన ఉపయోగం లేదన్నారు. రాజీనామా చేసి బయటకు వస్తే పార్లమెంటులో పోరాటం చేసేవారు ఎవరు ఉంటారని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప కేంద్ర పదవులు ముఖ్యం కాదని టీడీపీకీ చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించారన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతామని, టీడీపీ మద్దతు ఇవ్వాలని అంటున్నాడని అయితే అవినీతి పార్టీకి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు.