రాష్ట్రీయం

గవర్నర్, సిఎం కెసిఆర్, జగన్ ఉగాది శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవిళంబి నామ సంవత్సరం సందర్భంగా ఉగాది శుభాకాంక్షలను వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని, పాడి పంటలతో రైతులు వర్ధిల్లాలని, పల్లెలు కళకళలాడాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ ఉగాది తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిరిసంపదలు తీసుకురావాలని ఆయన సందేశంలో పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో వైభవంగా ఉగాది వేడుకలను జరుపుకోవాలని, రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలని, వాటితో రాష్ట్రం ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.