రాష్ట్రీయం

శ్రీశైల మల్లన్నకు బంగారు ఆభరణాలు, వెండి కిరీటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, మార్చి 26: శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబ అమ్మవారు, శ్రీ మల్లికార్జునస్వామి వార్ల కు విజయవాడకు చెందిన గోగులునాయుడు, విజయలక్ష్మి దంపతులు బంగారు హారాలు, వెండి కిరీటాలు విరాళం అందించారు. అమ్మవారికి 110 గ్రా ముల బంగారుతో మామిడి పిందెల హారం, స్వామి వారికి 122 గ్రాములతో బంగారు గుండ్లహారం, కల్యాణ ఉత్సవమూర్తులకు కిలో 279 గ్రాములతో వెండి కిరీటాలు సమర్పించారు. వీటి విలువ దాదాపు రూ.10.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపా రు. ఆభరణాలను ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, వేద పం డితులు రామకృష్ణ అవధాని, శ్రీనివాసరావుకు దాత లు అందజేశారు. దాతలు సమర్పించిన ఆభరణాల కు పండితులు సంప్రోక్షణ చేసి అలంకరించారు. అనంతరందాతలకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి ప్రసాదాలు అందించారు.

చిత్రం..శ్రీశైల మల్లన్న, భ్రమరాంబ అమ్మవార్లకు ఆభరణాలు, వెండి కిరీటాలు అందజేస్తున్న గోగులు నాయుడు కుటుంబం