రాష్ట్రీయం

ఒంటిమిట్ట ఘటనపై సీఎం ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 31: కడప జిల్లా అధికారులు, పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనె్నర్ర చేశారు. ఒంటిమిట్ట ఘటనతోపాటు, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం, అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా అధికారులు, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్జీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అందరిపై చెడామడా కోప్పడ్డారు. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో రెండు రోజుల ముందే వాతావరణంలో మార్పులు, వర్ష సూచనలను కచ్చితంగా తెలియజేస్తుంటే, గాలివాన వీచే విషయం ముందే తెలిసి ఉండి కూడా అందుకు తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు అలసత్వం చూపించారని అధికారులపై ఆగ్రహించినట్లు సమాచారం. వాతావరణ నిపుణులు తమకు చెప్పలేదని జిల్లా అధికారులు ఇచ్చిన సమాధానానికి ముఖ్యమంత్రి మరింత మండిపడినట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్లలో సైతం వాతావరణ యాప్‌లు చూస్తే రేపు వర్షం వచ్చే విషయం తెలుస్తోందని, తప్పించుకునేందుకు బుద్ధ్దిలేని మాటలు మాట్లాడవద్దని అధికారులను మందలించినట్లు సమాచారం.