రాష్ట్రీయం

జూరాలకు ఒక టీఎంసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గద్వాల జోగులాంబ జిల్లా జూరాల ప్రాజెక్టు కింద ఎండిపోతున్న పంటలను కాపాడటానికి కర్నాటక అంగీకరించింది. 30 వేల ఎకరాలలో వేసిన రబీకి సాగునీరు అందించేందుకు ఎగువనున్న కర్నాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి నీరు విడుదల తప్ప మరో మార్గం లేదు. దీంతో నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదివారం కర్నాటక నీటిపారుదలశాఖ మంత్రి పాటిల్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. మొదటి విడతగా ఒక టిఎంసి నీటిని నారాయణపూర్ డ్యామ్ నుంచి విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం అంగీకరించిందని హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకోవడం పట్ల జూరాల ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేసారు.