రాష్ట్రీయం
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 April 2018
విశాఖపట్నం, ఏప్రిల్ 2: ఛత్తీస్గడ్ నుంచి విదర్భ, మహారాష్ట్ర మీదుగా కర్నాటక వరకూ అల్పపీడనద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం రాత్రి ఉత్తరాంధ్రలో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ద్రోణి ప్రభావంతో భారీ గాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది.