సబ్ ఫీచర్

చర్మరోగ నివారిణి ‘నఖ రంజని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోళ్ళకు రంగును కలిగించే గోరింటాకు ‘‘నఖరంజని’’ అని పేరు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం అనాదిగా ప్రబలంగా ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట మంచి మూలిక. దాని ఆకులే కాదు... పూవులు, వేళ్ళు, బెరడు, విత్తనాలు, గింజలు, ఓషధ గుణాలు కలిగి ఉంటాయి. హన్నొటాన్నిక్ ఆసిడ్‌తో కూడి ఒకరకమైన చిరువిషం ఉంటుంది. గింజలో చమురుంటుంది. పూలతో అత్తరు, వాసన నూనె తయారు చేస్తారు. ఆకు నూరి ముద్దలో నిమ్మరసం కలిపి అరికాళ్ళకు పెట్టుకుంటే అరికాళ్ళ మంటలు, నొప్పులు తగ్గుతాయి. నూరిన ముద్దతో తెల్ల గుగ్గిలము కలిపి నుదిటికి పట్టిస్తే తలనొప్పి తగ్గగలదు. ఈ మందును మశూచి బాధితుల పాదాలకు పట్టిస్తే, రోగుల కళ్ళలో అమ్మవారు పోయేదని చెపుతారు. ముద్దతో కీళ్ళనొప్పులు మటుమాయం అవుతాయి. ఆకుల నుండి తయారు చేసిన మలామా గాయాలను, కురుపులను మాన్పుతుంది. బెణుకులు, వాపులు, కషాయంతో కాపడం వల్ల తగ్గుతాయి. దీనిని పుక్కిట పెడితే నోటిలో పుండ్లు తగ్గుతాయి. గోరింట పువ్వులతో నింపిన గుడ్డ సంచిని తలగడగా పెట్టుకుంటే మంచినిద్ర కలిగిస్తుంది. గోరింటాకు ముద్దను గోళ్ళకు పెట్టుకోవడం వలన చక్కని రంగు కలిగించడమే కాక, వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. గోరింటకు శరీరంలోని వేడిని తగ్గించే శక్తి ఉంది. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెను వాడడం చిట్కా వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు. శుభకార్యాల సందర్భాలలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తారు. గోరింటాకు ధారణ తెలుగు పడుచులలో విధివిధాయక కృత్యమైన్నది. అరికాళ్ళలో నూరిన ముద్ద చుక్క పెట్టుకుని, అది బాగా పట్టినట్లయితే అయిదవతన వృద్ధియని, బాగా పండితే భర్త ప్రేమ అధికమవుతుందని విశ్వాసం. ఆషాఢంలో మెట్టింటి నుండి పుట్టింటికి చేరుకునే కొత్త పెళ్ళి కూతుళ్ళు, పుట్టింట ఉన్న మనసు మెట్టినింటి ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ, గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా ఆచరణలో ఉంది. జ్యేష్టమాసంలో మొదలైన వర్షాలు ఆషాఢం వరకు ఊపందుకుంటాయి. అలా ఆడపడుచులు ఎక్కువగా వర్షాలలో తడవడం కద్దు. ఇక పొలం పనులు చేసుకునే వారు నిత్యం కాళ్ళు, చేతులు తడపకుండా ఉండలేరు. అలా చర్మ వ్యాధులు రావడం, గోళ్ళు దెబ్బతినడం సహజం. అందుకే ఈ ఉపద్రవ నివారణకు గోరింటాకు కనె్నల నుండి వృద్ధుల వరకు ధారణ నిత్యకృత్యంగా మారింది. గోరింట ఆకును కాచు, చింతపండు, నిమ్మరసంతో మెత్తగా నూరి, మగపిల్లలు, ఆడపిల్లలు, స్ర్తిలు చేతి వేళ్ళకు, పారాణిగా పాదాలకు పెట్టుకుంటారు. తద్వారా చర్మం, గోళ్ళు చిక్కని ఎర్రని రంగుతో శోభాయమానం అవుతాయి. కృత్రిమమైన రసాయనిక పదార్థాలతో తయారైన గోళ్ళరంగు కంటె గోరింటతో చేసుకున్న ముద్దతో పాత పద్ధతిని విడనాడకుండా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తుత తరుణంలో గుర్తెరగాలి. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకొమ్మన్నారని, ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్లమీద ఆధారపడడం మంచిది కాదు. అది శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపురంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు ఉపయోగించడం వల్ల ఎలర్జీ కలిగే అవకాశాలున్నాయి. కనుక సహజ సిద్దమైన గోరింటనే వాడడం మంచిది.

- సంగనభట్ల రామకిష్టయ్య