సబ్ ఫీచర్

కాలుష్య భూతానికి జీవ వైవిధ్యం బలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అనంత విశ్వంలో జీవ వైవిధ్యం ఉనికిని ఒక్క భూమిపై మాత్రమే చూస్తాం. మానవజాతి మాత్రమే కాదు, వివిధ రకాల వృక్షాలు, జంతుజాలం, జలచరాలు, పక్షులు, క్రిమికీటకాదుల మనుగడకు ఈ భూమియే ఏకైక ఆధారం. ఆధునికత, శాస్త్ర సాంకేతిక ప్రగతి పేరుతో మానవుడు సాగిస్తున్న వికృత విధ్వంస కేళి మానవజాతి మనుగడకే ప్రమాదకారిగా పరిణమిస్తున్నది. సకల ప్రాణికోటికీ మరణ శాసనాన్ని లిఖిస్తున్నది. రాబోయే కాలంలో మానవాళి తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోనున్నదనీ, స్వచ్ఛ జలాల వనరులు, ఇంధన వనరులు అంతరించిపోతాయనీ ఐక్యరాజ్యసమితి సహకారంతో జరిగిన ఒక జీవ వైవిధ్య అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనంలో 550 మంది ఉన్నతస్థాయి నిపుణులు పాల్గొన్నారు. ఈ అధ్యయనం 129 దేశాల ప్రభుత్వాల ఆమోదం పొందింది కూడా.
వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులతో 2050 నాటికి జీవ వైవిధ్యం పెనుముప్పును ఎదుర్కోనుందనీ, పర్యావరణ కాలుష్యంతో అడవులు అంతరించిపోతున్నాయనీ, వ్యవసాయ క్షేత్రాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఈ అధ్యయనం పేర్కొంటోంది. మన అస్తిత్వానికి ఆధారమైన భూమి క్షేమంగా సాగించాలంటే జీవ వైవిధ్యం పరిరక్షింపబడాలి. అమెరికా, ఆసియా, పసిఫిక్, ఆఫ్రికా, ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు సంబంధించి వేరువేరుగా పర్యావరణ నివేదికలను అధ్యయనకారులు సమర్పించారు. అమెరికాలో ప్రజలకు ఉపయోగంలో ఉన్న ప్రకృతి విలువ ఏడాదికి 24.3 ట్రిలియన్ల డాలర్లు. ఇందులో పంటలు, కలప, జల వనరులు, పర్యాటక ప్రదేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇది అలస్కా నుండి అర్జెంటీనా వరకు గల భూభాగం నుండి వచ్చే స్థూల ఉత్పత్తికి సమానం. ఇప్పుడు అమెరికాలో ప్రకృతి సహజమైన ఉత్పత్తులు మూడింట రెండు వంతులకు తగ్గిపోయింది. ‘అరుదైన సీతాకోక చిలుకలను, పక్షులను, రినోలను, వృక్షాలను సంరక్షించడం అవసరమే. కానీ ఇది మాత్రమే ‘జీవ వైవిధ్య పరిరక్షణ’ కాదు. జీవ వైవిధ్యం అనేది ఒక్క పర్యావరణానికే పరిమితమైన సమస్య కాదు. అది మొత్తం మానవ మనుగడకు సంబంధించిన సమగ్ర అంశం’ అని రాబర్ట్ వాట్సన్ అంటారు. ఈయన ‘ఇంటర్ గవర్నమెంటల్ సొసైటీ పాలసీ ప్లాటాఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టం సర్వీసెస్’ సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు.
విపరీతమైన వాయుకాలుష్యం వల్ల మధ్య ఆఫ్రికాలో హెక్టారు (2.5 ఎకరాలు) విస్తీర్ణంలో ఏడాదికి సగటున 14వేల డాలర్ల విలువచేసే వన సంపద నష్టపోతున్నట్టు అంచనా వేశారు. ‘వాతావరణంలో మార్పులు జీవ వైవిధ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. సంబంధిత ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోతే మన భవిష్యత్తు ప్రశ్నార్థకమే’అని రాబర్ట్ వాట్సన్ అంటారు.
ఇక జల కాలుష్యం విషయానికొస్తే- పదింట ఎనిమిది నదులు ప్లాస్టిక్ మ యమైపోయాయి. కలుషితమైన నదులలో ఎక్కువగా ఆసియాలోనే ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మత్స్య సంపద 2050 నాటికి అంతరించిపోనున్నది. ఆధునిక పేరుతో మానవుడు విచ్చలవిడిగా సాగిస్తున్న విధ్వంసక కార్యకలాపాల వల్ల ఆఫ్రికాలోని ఏనుగుల దగ్గర్నుంచీ ఐరోపాలోని వివిధ రకాల వృక్షాలు, నీటిలో పెరిగే నాచు మొక్కలు, నత్తగుల్లలు కనుమరుగు కానున్నాయి. ‘2100 నాటికి ఆఫ్రికాలోని వివిధ రకాల పక్షిజాతులు, క్షీరదాలు సగానికి పైగా అంతరించనున్నాయి’ అని ఎమ్మాఆర్చర్ అంటారు. ఈయన ఆఫ్రికన్ అసెస్‌మెంట్ సంస్థకు చెందిన కో-్ఛర్మన్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా గణనీయంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కొత్త విధానాల రూపకల్పన చేయవలసి ఉంది. ఇందులో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి.

-డాక్టర్ దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690