రాష్ట్రీయం

త్వరలో వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: రోజురోజుకు పెరుగుతున్న వైద్యావసరాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో 500 వైద్యుల పోస్టులు, 1000 నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. కోస్తాంధ్రలో తొలిసారిగా కాలేయ మార్పిడి జరిగిన విజయవాడ మణిపాల్ ఆస్పత్రిని ఆయన ఆదివారం సందర్శించి కాలేయ మార్పిడితో ఆరోగ్యంతో కోలుకుంటున్న శ్రీనివాస్‌ను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోను అవయవ మార్పిడి జరిగేలా ఆధునికీకరణ పనులు చేపడతామన్నారు. మరణానంతరం తన అవయవాలను కూడా దానం చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మంత్రి వెంట డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్, జీవన్‌దాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ టి.రవిరాజు, చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.కృష్ణమూర్తి, మణిపాల్ హాస్పటల్స్ విజయవాడ హెడ్ జి.కార్తిహైవేలన్ తదితరులున్నారు.