రాష్ట్రీయం

తల్లితో సినీ నటి స్వాతి రెడ్డి ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: సినీ నటి స్వాతిరెడ్డి అదృశ్యమైందంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తన కుమార్తె మూడు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లిందని, ఇంతవరకూ తిరిగి రాలేదని స్వాతిరెడ్డి తల్లి నాగేంద్రమ్మ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఒంగోలుకు చెందిన స్వాతిరెడ్డి అలియాస్ తనూష మూడు సినిమాల్లో నటించింది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనే సినిమాతోపాటు, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజెండ్’ సినిమాలోనూ స్వాతి నటించింది.
ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా ‘లవ్’ అనే సినిమా నిర్మాణంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యాపారి మాయమాటలు చెప్పి తన కుమార్తెను తీసుకుపోయాడని, వెడుతూ వెడుతూ తన ఇంట్లోని నగలు, నగదు కూడా తీసుకుని వెళ్లారని నాగేంద్రమ్మ ఆరోపించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు స్వాతిరెడ్డి మొబైల్ ఇఎంఐ నెంబర్, కాల్ డేటా ఆధారంగా ఆమె ప్రస్తుతం వాడుతున్న కొత్త నెంబర్‌ను గుర్తించి ఆమెకు తల్లి ఫిర్యాదు గురించి వివరించారు. దీంతో స్వాతిరెడ్డి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని తనను ఎవరూ బలవంతంగా తీసుకు వెళ్లలేదని, ఇష్టపూర్వకంగానే వెళ్లానని వివరణ ఇచ్చారు.
కొంతకాలంగా తన తల్లి డబ్బు విషయమై ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కుమార్తె బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న విషయం తెలుసుకున్న తల్లి నాగేంద్రమ్మ అక్కడికి చేరుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో సహనం కోల్పోయిన స్వాతిరెడ్డి తల్లిపై చేయిచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పారు. ఇద్దరికి కౌనె్సలింగ్ నిర్వహించిన అనంతరం తల్లి నాగేంద్రమ్మ తన కుమార్తె క్షేమంగా తిరిగి రావడంతో కేసును వెనుకకు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. కాగా తల్లితోనే ఉంటానని స్వాతిరెడ్డి చెప్పడం కొసమెరుపు.