రాష్ట్రీయం

చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణచాంద, డిసెంబర్ 12: ఆది లాబాద్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్ గ్రామంలో శనివారం ముగ్గురు పిల్లలు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. వడ్యాల్ గ్రామానికి చెందిన పుట్టి శ్రద్దాంక్, ఎనగందుల రాజు, లఖన్ అనే ముగ్గురు పది సంవత్సరాలలోపు పిల్లలు శనివారం ఉదయం ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. చెరువు పక్కన ఉన్న జామకాయలు తెంపుకొని సరదాగా స్నానం చేద్దామని చెరువులోకి దిగారు. చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు మృత్యువాత పడడంతో వారి కుటుం బ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై మల్లేష్ సంఘటన స్థలానికి చేరుకొని పిల్లల మృతదేహాలను ఈతగాళ్ల సహాయంతో బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.