ఆంధ్రప్రదేశ్‌

బతికుండగానే తల్లిని శ్మశానానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం : ఒక్కగానొక్క కుమారుడు తల్లిని శ్మశానంలో వదిలేసి వెళ్లిన ఘటన అమలాపురంలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పేరూరులో ఉప్పు సత్యవతి(80) గుడిసెలో ఉంటోంది. ఈమె కుమారుడు హనుమంతరావు రాజమహేంద్రవరంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కదల్లేని స్థితిలో ఉన్న తల్లిని బుధవారం హనుమంతరావు రాజమహేంద్రవరం తీసుకెళ్లాడు. అత్త సత్యవతి పోషణ భారం తీసుకునేందుకు హనుమంతరావు భార్య నిరాకరించింది. దీంతో హనుమంతరావు తల్లిని గురువారం ఉదయం అమలాపురం తీసుకువచ్చాడు. ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించుకునేందుకు ఎవ్వరూ అంగీకరించక పోవటంతో శ్మశానానికి తీసుకెళ్లి, అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ సమాచారం స్థానికుల ద్వారా తెలుసుకున్న సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ సిబ్బందిని అక్కడికి పంపించి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం వృద్ధాశ్రమంలో చేర్పించనున్నట్లు ఆయన తెలిపారు. హనుమంతరావుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.