రాష్ట్రీయం

బావిలో పడి ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.కొండూరు, డిసెంబర్ 31: దాహం తీర్చుకోవడానికి వెళ్ళి ప్రమాద వశాత్తు బావిలో పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన కొరికుప్పల కోటయ్య (50), భార్య నాగేంద్రమ్మ (46) బుధవారం మాధవరం గ్రామానికి చెందిన నరసింహారావు వరి పొలంలో గొర్రెలు మేపుకుంటూ దాహం తీర్చుకోవడానికి సమీపంలో ఉన్న నేలబావి వద్దకు వెళ్ళి నీళ్ళు తోడే ప్రయత్నంలో ముందుగా కోటయ్య కాలుజారి బావిలో పడిపోయాడు. భర్తను కాపాడే ప్రయత్నంలో భార్య నాగేంద్రమ్మ తన చీర కొంగును భర్తకు అందించే ప్రయత్నంలో ఆమె కూడా బావిలో పడిపోయింది. అంతలో ఇది గమనించిన సమీపంలోని ఉన్న మాధవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు (60) బావిలోకి దిగగా ఈత రాకపోవడంతో అతను కూడా మృత్యువాత పడ్డాడు. బంధువులు గురువారం వెతుకుతుండగా ముగ్గురు వ్యక్తులు బావిలో శవాలై కనిపించారు, మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. మైలవరం సిఐ వెంకటరమణ పర్యవేక్షణలో ఎఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలకు విఆర్‌ఓ నాగుల్‌మీరా సమక్షంలో శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఆసుపత్రికి తరలించారు.