ఆంధ్రప్రదేశ్
ఎలుగుబంటి దాడిలో ముగ్గురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 13 March 2016
భద్రాచలం, మార్చి 12: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లాలో శనివారం ఓ ఎలుగుబంటి దాడి చేసి ఫారెస్ట్ డెప్యూటీ రేంజర్తో సహా ముగ్గురిని బలిగొంది. అనంతరం పోలీసులు దాన్ని కాల్చిచంపారు. పటేవా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాగావ్ అనే గ్రామంలోకి ఎలుగుబంటి వచ్చింది. ఇద్దరు గ్రామస్తులపై అప్పటికే అది దాడిచేసి చంపేసింది. అదే సమయంలో గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ డెప్యూటీ రేంజ్ అధికారి తన సిబ్బందితో అక్కడకు వచ్చారు. ఎలుగుబంటి ఆయనపై కూడా దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఈవిషయాన్ని గ్రామస్తులు పోలీసులకు చెప్పడంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగి దాన్ని కాల్చిచంపాయి. నవాగావ్ గ్రామంలో విషాదం అలముకుంది.