రాష్ట్రీయం

నలుగురు ఐఏఎస్‌లకు టైమ్‌స్కేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంభం కార్పొరేషన్‌కు గడువు పెంపు
గొర్రెలు, మేకల కార్పొరేషన్ పునరుద్ధరణ
హైదరాబాద్, జనవరి 2: ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు సీనియర్ అధికారులకు టైమ్‌స్కేల్ పదోన్నతి కల్పిస్తూ ప్రస్తుత హోదాల్లోనే కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో 2012 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ మల్లిఖార్జున, విజయరామరాజు, ప్రసన్న వెంకటేష్, ఎస్ నాగలక్ష్మి ఉన్నారు. మల్లిఖార్జున సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా, విజయరామరాజు రాజమండ్రి కమిషనర్‌గా, ప్రసన్న వెంకటేష్ సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా, నాగలక్ష్మి గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా కొనసాగనున్నారు. కాగా మరో ఉత్తర్వులో కంభం కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకు లిమిటెడ్ పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు కొనసాగిస్తూ వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి విజయకుమార్ ఆదేశాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ లిమిటెడ్ కమిటీని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. కొత్త కమిటీకి చైర్మన్‌గా వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్యులుగా ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ముఖ్యకార్యదర్శి, ఆర్ధిక కార్పొరేషన్ ఎండి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, ఎండి సభ్యులుగా ఉంటారు.