రాష్ట్రీయం

ముర్రేడువాగులో పడి ఇద్దరు విద్యార్థినులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, జూలై 2: ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఇద్దరు విద్యార్థినులు ముర్రేడువాగులో పడి మరణించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావు న్నా యి. మున్సిపాలిటీ పరిధిలోని కుంటినాగులగూడెం గ్రామానికి చెందిన మోకాళ్ళ శిరీష (14), ములకలపల్లి మండలం వే ముకుంట గ్రామానికి చెందిన మడకం రోహిణితో (9) కలిసి బట్టలు ఉతికేందుకు ముర్రేడువాగు వద్దకు వెళ్ళారు. బట్టలు జాడిస్తున్న శిరీష వాగుప్రవాహ ఉద్ధృతికి నీటిలో పడి కొట్టుకుపోతుండగా స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నిం చిన రోహిణి కూడా వాగులో పడిపోయింది. దీనితో ఊపిరాడక ఇద్దరూ మృతి చెందారు. శిరీష 10వ తరగతి, రోహిణి 7వ తరగతి చదువుతున్నారు. ఇరువురు విద్యార్థుల మృతితో కుంటినాగులగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.