రాష్ట్రీయం

మట్టిపెళ్లలు పడి ఇద్దరు కార్మికుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లెందు, జూలై 2: ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతంలోని ఓపెన్‌కాస్టు మట్టిదిబ్బలలో శనివారం ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. పొట్టకూటి కోసం ట్రాక్టర్ పనికివెళ్ళిన వజ్జా రాంబాబు (29), బి.సీతారాములు (46) విధినిర్వహణలో ఉండగా మట్టిపెళ్లలు మీదపడి మృతిచెందారు. మండల పరిధిలోని దనియాలపాడు గ్రామానికి చెందిన వారితోపాటు మరో ఇద్దరు ట్రాక్టర్ లోడింగ్, అన్‌లోడింగ్‌తో బతుకు సాగి స్తున్నారు. పట్టణ పొలిమేరలోని ఓపెన్‌కాస్టు మైన్‌కు చెందిన పురాతన మట్టిగుట్టల వద్ద ప్రైవేట్ ట్రాక్టర్‌తో మట్టిని తొలగిస్తున్న క్రమంలో మట్టిదిబ్బలు కూలడం వలన ఇరువురు మట్టిలో కూరుకుపోయి మృతిచెందారు. వెంకటేశ్వర్లు అనే మరో కార్మికుడికి బలమైన గాయాలయ్యాయి. పట్టణానికి చెం దిన ట్రాక్టర్ సమీపంలోని కాలనీకి మట్టి తరలిస్తోంది. రాం బాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో మృతుడు సీతారాంకు ఒక కుమార్తె ఉంది. మృతదేహాలకు స్థానిక ప్రభు త్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనాస్థలాన్ని పోలీస్ అధికారులు, సింగరేణి అధికారులు పరిశీలించారు.

చిత్రం.. మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యం