రాష్ట్రీయం

హైదరాబాద్‌లో స్వచ్ఛ రైల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో దక్షిణ మధ్య రైల్వే ఆదివారం స్వచ్ఛ రైల్-స్వచ్ఛ్భారత్ రన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ రవీంద్ర గుప్తా స్వచ్ఛ శపథ్ ప్రతిజ్ఞ చేయించారు. రైల్వే అధికారులు, సిబ్బందితోపాటు సుమారు వెయ్యి మంది స్చచ్ఛ్భారత్ రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే జిఎం రవీంద్రగుప్తా మాట్లాడుతూ భారత జాతిపిత మహాత్మగాంధీ జయంతి రోజు స్వచ్ఛ రైల్- స్వచ్ఛ్భారత్ రన్ నిర్వహించుకోవడం ముదావహమన్నారు. ఈ సందర్భంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.