ఆంధ్రప్రదేశ్‌

చించినాడ వంతెనపై ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, నవంబర్ 9: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ వంతెనపై నుండి బుధవారం తెల్లవారుజామున కంటెయినర్ గోదావరి లంకలో పడిన ప్రమాదంలో డ్రైవరు, క్లీనరు మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఎస్‌కెబిఎస్ పేరు గల కంటెయినర్ ఒంగోలు నుండి రొయ్యల లోడుతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బయలుదేరి వెళ్లింది. దిగుమతి అనంతరం తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారు జామున యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ గోదావరి వంతెనపైకి వచ్చేసరికి అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వంతెన పైనుండి కంటెయినర్ లంకలోకి పడిపోవడంతో డ్రైవరు పి సందాని (25) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన క్లీనర్ యార్లగడ్డ పాములు (43)ను పాలకొల్లు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో వీరి మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించారు. కేసును పాలకొల్లు సిఐ చంద్రశేఖర్, యలమంచిలి ఎస్‌ఐ అప్పారావు దర్యాప్తు చేస్తున్నారు.