రాష్ట్రీయం

అధికార నివాసాలు ఖాళీ చేసిన మాజీ సీఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తమ అధికార నివాసాలను శనివారంనాడు ఖాళీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అధికార నివాసాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రుల నివాసాలను ఖాళీ చేయమనడాన్ని తండ్రీకొడుకులిద్దరూ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం విదితమే. కనీసం రెండేళ్లు సమయం కావాలని చేసిన అభ్యర్థనను సైతం సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం విదితమే. దీంతో ఇరువురు తమ అధికార నివాసాలను ఖాళీ చేయకతప్పలేదు.