రాష్ట్రీయం

వర్గీకరణపై సిఎం స్పష్టత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 14: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమో, కాదో 48 గంటల్లో చెప్పాలంటూ ఎంఆర్‌పిఎస్ అధినేత మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులోని ఓ హోటల్‌లో ఎస్సీ వర్గీకరణ, భవిష్యత్ కార్యాచరణ, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యల నేపథ్యంలో ఆదివారం జరిగిన సమావేశానికి కృష్ణమాదిగ హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వని పక్షంలో మిగిలిన పార్టీల్లో ఉన్న మాదిగలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ నెల 18న ఎస్సీ వర్గీకరణపై విజయవాడలో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పార్టీలకు చెందినవారిని సమావేశానికి ఆహ్వానించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వివరించారు. క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు.