రాష్ట్రీయం
రైతులతో ఉప రాష్ట్రపతి ముఖాముఖి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 August 2018
విజయవాడ :: ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గురువారం రైతులతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. ముందుగా.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నర్సింహపాలెంలో రైతులు నాడెప్ కంపోస్టు ద్వారా చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని వెంకయ్య పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా సమావేశమై ప్రకృతి వ్యవసాయం తీరు తెన్నులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంలో జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం, వరి పొలాలను వెంకయ్యనాయుడు పరిశీలించారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనురాధ, కలెక్టర్ లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.