ఆంధ్రప్రదేశ్
విలీన మండలాలను అభివృద్ధి చేస్తా: బాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 April 2016
కాకినాడ: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎపిలో విలీనమైన మండలాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తొలిసారిగా ఆయన బుధవారం విలీన మండలాల్లో పర్యటించేందుకు చింతూరు వచ్చారు. వ్యవసాయంపై ఆధారపడిన గిరిజనులకు మార్కెటింగ్ సౌకర్యాలు,రుణ పరపతి కల్పిస్తామన్నారు. గిరిజన విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను సిఎం ప్రారంభించారు. విభజన చట్టం ప్రకారం విలీన మండలాల్లో అందరినీ ఆదుకుంటామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళనలు అనవసరం అని ఆయన అన్నారు.