వినమరుగైన

కొల్లాయి గట్టితేనేమి? మహీధర రామమోహనరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాయి గట్టితేనేమి? నవలలోని కథా వస్తువు 1920లో ప్రారంభవౌతుంది. ఈ నవలలోని ప్రధాన పాత్ర రామనాథం. రామనాథం వెంటా, రామనాథం చుట్టూ ఈ నవల నడుస్తుంది. అంటే ఒక వ్యక్తి జీవిత కేంద్రంగా సామాజిక జీవితాన్ని ఆవిష్కరించిన నవల ఇది. గాంధీజీ పిలుపు మేరకు, తాను చదువుతున్న చదువుకు స్వస్తి చెప్పి, కళాశాలను బహిష్కరించి జాతీయోద్యమంలో భాగస్వామి కావటానికి రామనాథం ప్రయాణం కావటంతో ఈ నవల మొదలౌతుంది.
ఈ నవలలోని కథ ప్రారంభమయ్యేనాటికి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. యుద్ధానంతరం సైన్యంలో అసంతృప్తి ప్రబలింది-్ధరలు పెరగటం, మోయరాని పన్నుల భారం ఒకవైపు, పరాయి పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న జాతీయోద్యమం మరోవైపు, వీటిని అణచటానికి రౌలట్ చట్ట ప్రయోగం, జలియన్‌వాలాబాగ్ దారుణ మారణకాండ, గాంధీ పిలుపు కారణంగా సహాయ నిరాకరణోద్యమం-
ఇదంతా ఈ నవలకు నేపథ్యం-
జాతీయోద్యమ భావ బీజాలు, ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత, కాంగ్రె స్ పార్టీలో గాంధీ నాయకత్వం, విదేశీ వస్తద్రహనం, ఇంగ్లీషు చదువులను బహిష్కరించటం, ఖద్దరు వస్త్రాలు ధరించటం, చరఖా మీద నూలు వడకటం, ఇదంతా నవలకు పూర్వరంగం. గాంధీ సహాయ నిరాకరణోద్యమ ప్రభావంతో రామనాధం తాను చదువుతున్న కాలేజీ చదువును బహిష్కరించి, విదేశీ వస్త్రాలు దహనం చేసి, ఖద్దరు ధరించి, తన స్వగ్రామమైన ముంగండకు వస్తాడు. ఆముంగండ ఎట్లాంటిదీ అంటే పరమ నైష్ఠికతకూ, ఛాంద సంప్రదాయాలకూ, కరడుగట్టిన ఆధిపత్యానికి మారు పేరు! దళితులను చాలా హీనంగా చూస్తూ, వాళ్లు తాగటానికి చెరువు నీళ్లు ఇవ్వటానికి ఇష్టపడని అగ్రకులాల కొంప అది! విదేశీయానం చేసినవారు ఆవు పేడ మింగి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే-నిజానికి ఈ ముంగండ రచయిత మహీధర గారి స్వంత వూరే. ఆ వూరి అగ్రకులం నెరపే పాశవిక అనాగరిక దుశ్చర్యలు ఆయన కళ్లారా చూసినవే! అలాంటి వర్ణాన్ని పూచిక పుల్లలా విసిరి పారేవేస్తాడు రచయిత ఈ నవలలో-
రామనాథం, గాంధీజీ భావజాలంతో ప్రేరితుడైన మంచి మనిషి- అతడు గ్రామంలో ప్రవేశించగానే తన సంస్కరణ, ఆశయాలను అమలు జరపటానికి ప్రయత్నిస్తాడు. దళితులకు తన తోటలోని బావిని తాగునీటికోసం ఇస్తాడు. దాని ప్రారంభానికి దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారిని పిలుస్తాడు. ఊళ్లో అందరిచేత వెలి అవుతాడు-అయినా సాహసోపేతంగా తను నమ్మిన సంస్కరణను అమలు జరుపుతాడు. ఖద్దరు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపిస్తాడు. దాన్ని సందర్శించటనాకి గాంధీజీ లాంటి మహానాయకుణ్ణి ఆహ్వానిస్తారు.
రామనాధం తన స్వగ్రామానికి వచ్చేటపుడు దారిలో ‘స్వరాజ్యం’ అనే నాయుళ్ల అమ్మాయి పరిచయమవుతుంది. స్వరాజ్యం తండ్రి ‘అబ్బాయి నాయుడు’ బ్రహ్మ సమాజం భావాలు కలిగినవాడు-వీరేశలింగం శిష్యుడు. ఆడపిల్లలకు చదువు అవసరం గుర్తించిన వాడు. అందువల్ల కూతురుకు ఇంగ్లీషు చదువు చెప్పించాడు. అప్పటికే ఆమెకు పెళ్లయింది. ఆడపిల్ల చదువుకోవటం వాళ్లకి నచ్చలేదు.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సింగమనేని నారాయణ