వినమరుగైన

జానకి విముక్తి - ముప్పాళ్ళరంగనాయకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగనాయకమ్మగారి జానకి విముక్తి నవల తెలుగు నవలా చరిత్రలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న నవల. ఈ నవలని రంగనాయకమ్మగారు మూడు భాగాలుగా రాశారు. మొదటి భాగాన్ని 1977లో, 2వ భాగాన్ని 1980లో, మూడవ భాగాన్ని 1981 జనవరి నుండి 1982 జూన్ వరకూ రాశారు.
రెండో భాగం ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వస్తూ అర్థాంతరంగా ఆపివేయబడింది. నవలలో సిద్ధాంత చర్చలు ఎక్కువగా వున్నాయనీ, పాఠకులు డ్రాగింగ్‌గా ఫీలవుతున్నారనీ, అందువలన ఆపివేస్తున్నట్లు ఎడిటర్ చెప్పాడు. 3వ భాగం డైరెక్టుగా వచ్చింది.
ఇది 1150 పేజీలుపై చిలుకువున్న పెద్ద నవల. ఒక సుదీర్ఘ జీవితాన్ని గూర్చి వివరిస్తూ, ఆ జీవితం చుట్టూ వున్న కనపడీ, కనపడని అంశాలను పాఠకుడి దృష్టికి స్పష్టంగా తెచ్చి, సమస్యలకు పరిష్కారాన్ని చూపుతూ ముగింపునిచ్చిన నవల యిది. ఇంత ఇతివృత్తాన్ని చెప్పటానికి అంత కాన్వాసు కావాల్సిందే మరి.
ఈ నవల చదివాక పాఠకుడికర్థమయ్యే ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ప్రజా రచయితల్లో కూడా రెండు రకాలుగా రచనలు చేసేవారు వున్నారనీ, ఒక తరహా రచయితలు జీవితాల్లోని, వ్యవస్థల్లోని లోపాల్నీ, లొసుగుల్నీ ఎత్తిచూపి అంతటితో ముగిస్తారనీ; రెండవ తరహా రచయితలు సమస్యలకు పరిష్కారం ప్రతిపాదిస్తూ ఆ దిశగా పాఠకుణ్ణి తీసికెళ్తారనీ అర్థమవుతుంది. జానకి విముక్తి అలాంటి రెండవ తరహా రచన.
అట్టమీది బొమ్మ దగ్గరనుండి ఆలోచిస్తే ఈ నవల గురించి ఎన్నో విషయాలు పాఠకుడికి అర్థమవుతాయి. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్. మూడు భాగాలకూ వేరువేరుగా వేసిన అర్థవంతమైన ముఖ చిత్రాలు. నవలా నేపథ్యాన్ని వివరించే మూడు ముందు మాటలు. తెలుగు పాఠకులకు ఎప్పటినుండో పరిచయమైన రంగనాయకమ్మగారి చక్కటి రచనాశైలి. కథకు తగిన శిల్పం, అన్నిటికన్నా ముఖ్యంగా వినూత్నమైన కథావస్తువు.
ఇక కథలోకి వెళ్లేకొద్దీ జీవితాన్ని గురించీ, జీవన విధానాన్ని గురించీ, ఈ సమాజం గురించీ, సంస్కృతి గురించీ, వ్యవస్థ గురించీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. నవల చదవటం పూర్తయ్యేసరికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ తరహా నవల తెలుగులో ఇంకొకటి లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కదా.జానకి విముక్తి అభివృద్ధికరమైన, ఆరోగ్యకరమైన రచన.
ఇక నవలలోని పాత్రల దగ్గరకొస్తే, ప్రధాన పాత్రలు జానకీ, ఆమె అన్నయ్య సత్యం. అతని జీవితభాగస్వామి శాంత, జానకి మొదటి భర్త వెంకట్రావు. అతనితో విడిపోయాక ఆమె జీవితంలో ప్రవేశించే సహచరుడు ప్రభాకర్. జానకి తల్లి సుందరమ్మ, జానకి స్నేహితురాలు విశాలాక్షి, డాక్టర్ మూర్తి, ఇంకొన్ని చిన్నా చితాకా పాత్రలు. ఈ నవలలో ఏ పాత్ర వ్యక్తిత్వం దానిదే. ఒకదానికీ ఇంకొకదానికీ ఎక్కడా పోలిక వుండదు. ఏ పాత్రనీ పాఠకులు మరిచిపోరు.
మనమిక కథలోకి వెళితే 16 ఏళ్ల జానకి, పెళ్లయి భర్త వెంకట్రావుతో కాపురం చెయ్యటానికి, కాపురానికి వెళ్లిన దగ్గరనుండి మనకు పరిచయమవుతుంది.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-జి.మోహన్‌రావు