వినమరుగైన

జానకి విముక్తి - ముప్పాళ్ళరంగనాయకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా నాన్నల చాటున అల్లారు ముద్దుగా పెరిగిన జానకి ప్రపంచంలోని స్ర్తి పురుషులంతా తన అన్నలా, తండ్రిలా, తల్లిలా, స్నేహితురాళ్లలా స్వచ్ఛంగా, ప్రేమగా, స్నేహంగా ఉంటారనుకుంటుంది.
అందరు మధ్య తరగతి తల్లిదండ్రుల్లాగానే పిల్ల సుఖపడుతుందనే ఆశతో, ఎర్రగా బుర్రగా ఎంఎస్సీ చదివి, ఉద్యోగం వెలగబడుతున్న వెంకట్రావుకి జానకినిచ్చి కట్టబెడతారు ఆమె తల్లిదండ్రులు.
లోకంలోని కల్మషాన్ని గురించి తెలియని ఎంతోమంది ఆడపిల్లల్లాగానే వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన జానకి, ఆ జీవితంలోని కష్టాల్ని చూచి బెంబేలెత్తిపోతుంది. భర్తా, అత్తా పెట్టే మానసిక శారీరక హింసలకు తల్లడిల్లిపోతుంది. భర్త వెంకట్రావు సంస్కారంలేనివాడనీ, మూర్ఖుడనీ, దుర్మార్గుడనీ, శీలం లేని వ్యక్తనీ జానకి చాలా త్వరగా అర్థం చేసుకుంటుంది.
యంఎస్సీలు, యంబిబియస్‌లూ ఫ్యూడల్ సంస్కతీ సంప్రదాయాలకు అతీతంగా, స్ర్తి పురుషులకు ఉన్నత విలువలు నేర్పే చదువులు కావని వెంకట్రావు పాత్ర స్పష్టం చేస్తుంది. పురుష అహంకారానికి నిలువెత్తు ఉదాహరణ వెంకట్రావు పాత్ర. ఎంతో నీచంగా, సంస్కార రహితంగా జీవితానికి కనీస ధ్యేయం లేకుండా, జంతువులాగా, చైతన్యరహితంగా రోజుల్ని దొర్లిస్తుంటాడు అతను.
అలాంటి వెంకట్రావు సహజంగానే జానకి బేల హృదయాన్ని తల్లడిల్లజేస్తాడు. జానకి ముగ్ధ మనోహర రూప లావణ్యాలను కనీసంగా గుర్తించలేని అతను, భర్త పాత్రలో మునిగిపోయి ఆ మురికిలోనే ఈదులాడుతుంటాడు.
అలా జానకి ఆ సంసారంలో నరకం అనుభవిస్తున్న తరుణంలో ఆమె అన్నయ్య సత్యం చెల్లిలి సంసారంలోని వాస్తవాలను గమనిస్తాడు. తోబుట్టువు మేలుకోసం తపన పడతాడు. జానకి భర్త ఏమీ మారడని అర్థం చేసుకున్నాక, జానకిని ఆ నరకం నుండి రక్షించే భాగంలో ఆమెను ధైర్యవంతురాలిని చెయ్యటానికి పూనుకుంటాడు. ఎన్నో విషయాలు జీవితానికి చెందినవి వివరిస్తాడు. జానకికి ఉపయోగపడే పుస్తకాలిచ్చి వాటిని ఆమె చదివేలాగా ప్రోత్సహిస్తాడు.
సత్యం అండదండలూ, ఆ పుస్తకాల ప్రోత్సాహం, చైతన్యం, జానకికి తన భవిష్యత్ జీవితం గురించి లీలగా ఒక అవగాహన కలిగిస్తాయి. అవి నూతన జీవితాన్ని ఆమె మనోపథంలో ఆవిష్కరింపజేస్తాయి.
జీవితాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, వ్యవస్థను గురించి, స్నేహాల్ని గురించి, స్ర్తి పురుషుల మధ్య వుండాల్సిన ప్రేమానురాగాల్ని గురించీ మానవులు నిజంగా ఆచరించవలసిన విలువల్ని గురించీ, ఆ పుస్తకాలు ఆమెకు విప్పి చెప్పి ఆమె జ్ఞానేత్రాన్ని తెరిపిస్తాయి.
జానకిని ఇలాంటి విజ్ఞానకరమైన ఆలోచనలవైపు నడిపించిన కథల్నీ, నవలల్నీ రంగనాయకమ్మగారు ఈ నవలలో వివిధ పాత్రల ద్వారా విశే్లషించిన నేపథ్యం ఈ నవల చదివే పాఠకుల్ని ముగ్థుల్ని చేస్తుంది.
ఆమె ఈ నవలలో ప్రస్తావించిన చలం మైదానం, గోర్కీ కథలు, మపాసా రాసిన కన్నీరు నవల, టాల్‌స్టాయ్ కథలు విందు తర్వాత, అనుమానం, ప్రేమ్‌చంద్ గబన్, కార్ల్ మార్క్స్‌గారి వివరణలకి- పాఠకుణ్ణి వాటిని చదివేలా చేస్తాయి.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-జి.మోహన్‌రావు