ఆంధ్రప్రదేశ్
వైష్ణవ ఆలయాల్లో పోటెత్తిన భక్తులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 December 2015
తిరుపతి: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఎ.పి.లోని తిరుమల, ఒంటిమిట్ట, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, తెలంగాణలో యాదాద్రి, భద్రచలం, వేములవాడ తదితర ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. తిరుమలలో స్వామివారు ఈ రోజు ఉదయం స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు స్వర్ణ రథంపై తిరువీధుల్లో విహరించారు. యాదగిరిగుట్టలో గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.