క్రైమ్/లీగల్

రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, మార్చి 21: వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం రాత్రి 10 గంటలకు ఢీకొన్న సంఘటనలో ఇరువురు యువకులు మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలైనాయి. బుధవారం రాత్రి జరిగిన సంఘటనలో భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన తంగళ్లపల్లి శ్రీనివాసాచారి వరంగల్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం శివారుకు రాగానే హుస్నాబాద్ నుండి మరొక ద్విచక్ర వాహనంపై జన్ను వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ ఆయన సమీప బంధువు కవితతో కొత్తపల్లి శివారుకు రాగానే ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో తంగళ్లపల్లి శ్రీనివాసాచారి (45), దన్ను వెంకటేష్ (30) ఇరువురు తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలై కొట్టుమిట్టాడుతున్న కవితను వరంగల్ ఎంజిఎంకు తరలించారు. వరంగల్-సిద్ధిపేట హైవేపై రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇరువురు మృతి చెందారని వార్త దావానంలా వ్యాపించడంతో వేలాది మంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హసన్‌పర్తి సిఐ రవి కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.