ఆంధ్రప్రదేశ్
రైల్వే జోన్ కోసం విశాఖలో ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 7 September 2016
విశాఖ: కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రకటించబోయే ప్రత్యేక ప్యాకేజీలో విశాఖకు బదులు విజయవాడకు రైల్వేజోన్ కేటాయిస్తారన్న వార్తలు రావడంతో బుధవారం ఇక్కడ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ప్రారంభమైంది. జివిఎంసి కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకారులు నిరసన ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైల్వేజోన్ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని, దీన్ని మరో చోటకు తరలిస్తే ఉద్యమించి తీరుతామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. రైల్వేజోన్ ఉత్తరాంధ్ర హక్కు అని వారు నినాదాలు చేశారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి రైల్వేజోన్ను సాధించి తీరుతామని వారు ప్రతిజ్ఞ చేశారు.