-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదేశాలతో మాదాపూర్ ఏసీపీ అట్రాసిటీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అట్రాసిటీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసినందుకు బాధితుడు సురేష్ నాయక్ (ఐఎస్టీఎం బీజినెస్ స్కూల్) కృతజ్ఞతలు తెలిపారు.
గుడ్లూరు, ఆగస్టు 9: 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు.
శాలిగౌరారం, ఆగస్టు 9: అభం శుభం ఎరుగని నాలుగేళ్ల బాలుడిని కన్నతండ్రే గొంతు నులిమి హత్య చేశాడు. సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని తిర్మలరాయిన్గూడెం గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. సీఐ క్యాస్ట్రోల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చింతల కనకయ్య, భార్య స్వప్నలకు మధ్య తరచూ గొడవలు తలెత్తుండటంతో స్వప్న తన కుమార్తెను తీసుకుని ఇటీవలే హైదరాబాద్కు బతుకుదెరువుకు వెళ్లింది.
తవణంపల్లి , ఆగస్టు 9: ఆహారం కోసం వెతుక్కుంటూ గ్రామాలపైకి వచ్చి ఇళ్లపై ఏనుగుల గుంపు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా తవణం పల్లి మండల శివారు మాధవరం అటవీ ప్రాంతంలో గురువారం జరిగింది. ఏనుగుల గుంపు యానాదుల ఇళ్లను ధ్వంసం చేశాయి. ఏనుగుల బీభత్సానికి భయబ్రాంతులైన యానాదులు ప్రాణభయంతో తలోదిక్కు పరుగులుపెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు.
శ్రీనగర్, ఆగస్టు 9: కాశ్మీర్లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్న మరో 20 మందిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆగ్రాకు తరలించింది. గురువారంనాడు 25 మందిని రాష్ట్రం నుంచి తరలించిన విషయం తెలిసిందే. తాజాగా తరలించిన 20 మంది కూడా రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించేందుకు అవకాశం ఉన్నవారేనని, అందుకే వీరిని ముందు జాగ్రత్త చర్యగా విమానాల్లో ఆగ్రాకు తరలించినట్టు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: అయోధ్య వివాద పరిష్కారంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న రోజువారీ విచారణ అనేక ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెస్తోంది. ఇరు పక్షాల వాదానలను వింటున్న సుప్రీంకోర్టు అనేక కీలక ప్రశ్నలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా శుక్రవారంనాడు జరిగిన విచారణలో ఓ ప్రశ్నను సంధించింది. శ్రీరాముడి వారసులు ఇంకా అయోధ్యలో ఉన్నారా?
శ్రీనగర్, ఆగస్టు 9: జమ్మూకాశ్మీర్లో నాలుగైదు రోజులుగా ఇళ్లకే పరిమితపైన ముస్లింలు బయటకు వచ్చి మసీదుల్లో ప్రార్ధనలకు హాజరయ్యారు. శుక్రవారం ప్రార్ధనలు సందర్భంగా ఆంక్షలు సడలించినట్టు అధికారులు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంత వాతావరణం కనిపించింది. ఉత్తర కాశ్మీర్లోని సోపోర్ పట్టణంలో రాళ్ల రువ్వడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
లక్నో, ఆగస్టు 9: ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని ఆరోపిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీవ్రంగా ఖండించింది.
అహ్మదాబాద్, ఆగస్టు 9: పరువు నష్టపరిహారం కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాందీని అక్టోబర్ 11న తప్పని సరిగా హాజరుకావాలని అహ్మదాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.
శంషాబాద్, ఆగస్టు 8 హైదరాబాద్, బెంగళూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన ఆర్జీ ఐ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..