-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
నల్లగొండ, ఆగస్టు 8: గుజరాత్ హోంశాఖ మంత్రి హరెన్ పాండ్య హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఐఎస్ఐ ఉగ్రవాది అస్గర్ అలీని నల్లగొండ పోలీసులు పటిష్ట భద్రత నడుమ గుజరాత్కు తరలించి గురువారం అహ్మదాబాద్ కోర్టులో హాజరుపరిచారు. ఇటీవలే గుజరాత్ కోర్టు హరెన్ పాండ్య హత్య కేసులో అస్గర్ అలీని ప్రధాన దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది.
మిడ్జిల్, అగస్టు 8: లంచం తీసుకుంటూ విద్యుత్ ఏఈ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. మండల కేంద్రంలోని విద్యుత్ ఏఈగా పనిచేస్తున్న పర్వతాలు గురువారం మహబూబ్నగర జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని కోత్తూర్ గ్రామానికి చెందిన బొంపల్లి రాజేందర్రెడ్డి వద్ద ట్రాన్స్ఫార్మర్ విషయంలో రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సికిందరాబాద్, ఆగస్టు 8: గాంధీ ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో సిబ్బంది స్పందించడంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం తప్పింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీ ఆసుపత్రి 3వ అంతస్తులో పీడియాట్రిక్ ఆపరేషన్ వార్డు ఎన్ఐసీయూ విభాగం ఉంది. ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించి ఆపరేషన్కు ఏర్పాట్లు చేస్తారు.
హైదరాబాద్, ఆగస్టు 8: ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న పది మంది అధికారులకు హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్షలను ఖరారు చేసింది. 2007లో ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి 57 లక్షల రూపాయిలు నష్టం కలిగేలా సిబ్బంది మోసం చేశారంటూ కంపెనీ కేసు నమోదు చేసింది.
గజపతినగరం, ఆగస్టు 8: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కాళంరాజుపేటలో ఓ మైనర్ బాలిక (12)పై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిని గురువారం గజపతినగరం ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి గురువారం సీఐ ఎస్.విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం కాళంరాజుపేట గ్రామానికి చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన గేదెల జగదీష్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
వరంగల్, ఆగస్టు 8: తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై అత్యాచారం, అపై హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష పడడం సరైందేనని అన్ని వర్గాల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. గురువారం వరంగల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా చిన్నారి అత్యాచారం, హత్య చేసిన నిందితునికి వరంగల్ జిల్లా ఫస్ట్ అదనపు జడ్జి జైకుమార్ ఇచ్చిన సంచలన తీర్పు ను అన్ని వర్గాలను అకట్టుకుంది.
వరంగల్, ఆగస్టు 8: పశు కామవాంఛతో పసికందు జీవితాన్ని చిదిమేసిన మానవమృగానికి ఉరిశిక్ష పడింది. సరిగ్గా 48 రోజుల క్రితం వరంగల్ నగరంలోని హన్మకొండ టైలర్ స్ట్రీట్లో తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై జరిగిన ఈ దారుణ సంఘటనపై వరంగల్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జైకుమార్ గురువారం సంచలనమైన తీర్పునిచ్చారు. హంతకుడు ప్రవీణ్ జడ్జి ఎదుట నేరాన్ని అంగీకరించాడు.
విశాఖపట్నం, ఆగస్టు 8: మహిళలపై నేరాలు నియంత్రించడంతో పాటు వారికి సరైన రక్షణ కల్పించేందుకు వర్చువల్ పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర హోం శాఖ వౌఖికంగా వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 8: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) చైర్మన్ అనిల్ కుమార్ చౌదరిపై హత్యాయత్నం జరిగింది. బుధవారం రాత్రి సెయిల్ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న కుమార్పై గుర్తుతెలియని ఇద్దరు దాడి చేశారు. ఇనుప రాడ్లతో తల, మెడ, కాళ్లపై కొట్టారు. రాత్రి 10.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసినట్టు వారు తెలిపారు.
సంగ్లీ, ఆగస్టు 8: మహారాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వరదతో అల్లాడుతున్న సంగ్లీ జిల్లాలో జరిగిన పడవ ప్రమాదంలో తొమ్మిది మంది గల్లంతయ్యారు. పలుస్ తాలూకాలోని బ్రహ్మనాల్ గ్రామంలో కృష్ణానదిలో ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా ఈ విషాదం జరిగింది.