-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఆధార్ ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ దాఖలయిన ఒక పిటిషన్పై వైఖరిని తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆధార్కు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్కు ఉన్న రాజ్యాంగబద్ధతను ఈ పిటిషన్ సవాలు చేసింది.
అమలాపురం, ఏప్రిల్ 11: ఎన్నికల విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్పై ఇటుకలతో దాడికి పాల్పడిన అల్లరిమూకను చెదరగొట్టడానికి తూర్పు గోదావరి జిల్లాలో గురువారం బీఎస్ఎఫ్ దళాలు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అమలాపురం రూరల్ మండలం జనుపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
సైదాబాద్, ఏప్రిల్ 11: ఎన్నికల నియామళికి వ్యతిరేకంగా ఓటు స్లిప్పులతో పాటు పార్టీ గుర్తును ఇస్తూ ప్రచారం చేస్తున్న మజ్లిస్ పార్టీకి చెందిన వార్డు సభ్యుడిని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేసారు. పోలీసుల కథనం ప్రకారం..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. అనిల్దత్తా దర్శకత్వం వహించిన ‘్భబిష్యోటర్ భూత్’ అనే చిత్రం ప్రదర్శనను నిలిపివేయడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ వ్యంగ్యోక్తులతో నిర్మించారన్న సాకుతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సినిమా ప్రదర్శనను ఆపించేసింది.
గుంటూరు, ఏప్రిల్ 10: గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇంటిపై బుధవారం రాత్రి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఎన్నికలకు కేవలం 12 గంటల సమయం కూడా లేకుండా దాడులు జరగడం నగర ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
తడ: శ్రీ సిటీలోని ఒక గోడౌన్ నుంచి చెన్నైకి పోలీసు ఎస్కార్ట్తో వెళుతున్న వాహనాన్ని ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేయగా 175కేజీల బంగారం ఉండటంతో ఆరంబాకం పోలీసులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీసిటీలోని ఒక గోడౌన్ నుంచి తమిళనాడుకు పోలీసు ఎస్కార్ట్తో వెళుతున్న జీపును ఆరంబాకం పోలీసులు తనిఖీ కోసం ఆపారు.
మేడ్చల్, ఏప్రిల్ 10: యువకుడు అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గౌడవెల్లి గ్రామ పరిధిలోని కృషి అనాథాశ్రమంలో ఉంటూ ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసి పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఎన్.తిరుపతి (17) దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 7వ తేదీన ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అశ్రమం నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
గచ్చిబౌలి, ఏప్రిల్ 10: ఎన్నికల నిబంధనలలో భాగంగా గచ్చిబౌలి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా గచ్చిబౌలి ఎస్ఎల్ఎన్ టవర్ వద్ద స్కోడా కారులో 10లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎల్ఎన్ వ్యాలీ నుంచి బయటకు వస్తున్న స్కోడా కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో రూ.10 లక్షల నగదు లాప్టాప్ డైరినీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రాజేంద్రనగర్, ఏప్రిల్ 10: కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ బాక్స్ పేలి కార్మికునికి తీవ్ర గాయాలైన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకునేందుకు వెళ్లిన ఇన్స్పెక్టర్, కార్పొరేటర్లకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్ర్తిపురంలో కెమికల్ ఫ్యాక్టరీ కొనసాగుతుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రాఫెల్ కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాఫెల్ తీర్పుపై వెలువరించిన తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై కేంద్రం తెలిపిన అభ్యంతరాలను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.