S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/09/2019 - 01:23

ఉప్పల్, ఏప్రిల్ 8: మేడిపల్లి గణేష్‌నగర్‌లోని ప్రసాద్ పొలిమేర్ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. గోదాంలో నుంచి అకస్మాత్తుగా పొగ, మంటలు ఉవ్వెత్తున రావడంతో పరిసర ప్రాంతాల కాలనీల ప్రజలు భయంతో పరుగులు తీశారు. అందిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి అగ్నిమాపక కేంద్రాలను రప్పించి మంటలను ఆర్పించారు.

04/09/2019 - 01:02

మల్దకల్, ఏప్రిల్ 8: జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తున బావిలోపడి ఐదుగు రు బాలికలు మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరి ఎల్లప్పకు నలుగురు కుమార్తెలు సంతానం కాగా వీరిలో యమున (12), చిన్నారి (10), బుజ్జి (8) బావిలోపడి మృతి చెందారు. కుమ్మరి కృష్ణకు కుమారుడు, కుమార్తె సంతానం కాగా చిన్నారి (9) మృతి చెందింది.

04/08/2019 - 23:30

హైదరాబాద్: నిజామాబాద్ ఎన్నికపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు సోమవారం నాతడు నిరాకరించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

04/08/2019 - 05:21

అల్లాదుర్గం, ఏప్రిల్ 7: మెదక్ జిల్లా అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలోని 161 జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న కండక్టర్, డ్రైవర్‌తో సహా 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

04/08/2019 - 05:19

మిర్యాలగూడ, ఏప్రిల్ 7: ఈత సరదా ఓ ఇంట్లో తండ్రి, కొడుకులను జల సమాధికి కారణమైన ఉదంతం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. సంఘటన వివరాలు సోలీసుల కథనం ప్రకారం..

04/08/2019 - 05:16

కేసముద్రం, ఏప్రిల్ 7: ఆస్తికోసం కన్న తండ్రిని కొట్టి చంపిన కొడుకు ఉదంతం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికనె్న శివారు ముత్యాలమ్మతండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సతీష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

04/08/2019 - 04:55

హైదరాబాద్, ఏప్రిల్ 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పోలీస్ తనిఖీల్లో నగదు భారీగా పట్టుబడుతోంది. హైదరాబాద్ పరిధిలో శనివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు రూ.4.92 కోట్ల రూపాయలు టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అనుసరించి జంటనగరాల్లో నిఘా పెంచామన్నారు.

04/08/2019 - 04:23

హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు తమ విధానం ఏమిటో స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈబీసీని అమలుచేయడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుపై మరీ ముఖ్యంగా నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా జరిగే ఎంబీబీఎస్, బీడీఎస్‌ల అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి పద్ధతిని అనుసరించబోతున్నారో తేల్చి చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

04/08/2019 - 03:22

నేరేడ్‌మెట్, ఏప్రిల్ 7: మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన వ్యక్తిని బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముషిరాబాద్ రామ్‌నగర్‌లో నివసించే సాయితేజ అలియాస్ సన్ని(27), ప్రైవేట్ ఉద్యోగి. మల్కాజిగిరి పీవీఎన్ కాలనీలో నివసించే అతని చెల్లెలి క్లాస్‌మెట్ యువతి(23)తో కొంత కాలం క్రితం పరిచయం పెంచుకున్నాడు.

04/08/2019 - 05:26

సిరిసిల్ల, ఏప్రిల్ 7: బతుకమ్మ చీరల ఉత్పత్తిలో బోగస్ పవర్‌లూం మ్యాక్స్ సొసైటీ వ్యవహారం, నాసిరకం నూలు వినియోగం ఉదంతాలపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈమేరకు గత వారం రోజులుగా మ్యాక్స్ సంఘాల ప్రతినిథులతో విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

Pages