S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/27/2018 - 00:55

బాలాపూర్, డిసెంబర్ 26: ఎల్బీనగర్ డీసీపీ జోన్ పరిధిలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు, దాదాపు 15 తులాల బంగారు ఆభరణాల దొంగలింపు. బుధవారం ఎల్బీనగర్ డీసీపీ పరిధిలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు తమ ప్రతాపాన్ని చూపించారు.

12/27/2018 - 00:33

హైదరాబాద్, డిసెంబర్ 26: జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామక ప్రక్రియలో స్పోర్ట్సు, వికలాంగుల కోటాను విస్మరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై హైకోర్టులో బుధవారం నాడు వాదనలు జరిగాయి. స్పోర్ట్సు, వికలాంగుల కోటాను సరిచేసిన తర్వాతనే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

12/26/2018 - 23:49

భీమునిపట్నం, డిసెంబర్ 26: భీమిలి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 22ఏళ్ల వివాహిత బుధవారం సాయింత్రం ఆత్మహత్యచేసుకున్న వైనమిది. భీమిలి క్రైం ఎస్‌ఐ పి.శ్రీను అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మిపురం గ్రామానికి చెందిన అంగటి రాము(22) అనే మహిళకు ఏడేళ్ల క్రితం దాలినాయుడుతో వివాహమైంది. వారికి ఒక పాప కూడా కలదు. ఐతే కొన్నాళ్లుగా ఆమె భర్తనుండి వేరుపడి ఉంటున్నది.

12/26/2018 - 23:42

చిత్తూరు, డిసెంబర్ 26: జిల్లాలో పలు చోట్ల దాడులు నిర్వహించి 32 నాటు తుపాకులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ముఠాను, జిల్లాలో రాగి వైర్ల కోసం వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేస్తున్న గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.

12/26/2018 - 23:42

బంగారుపాళ్యం, డిసెంబర్ 26: జిల్లాలో వివిధ రకాల దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బొలెరో వాహనం, రూ. 6లక్షల నగదు, పోలీస్ యూనిఫాం, వైర్లెస్ సెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. బుధవారం ఎస్సై మాట్లాడుతూ ఎనిమిది మంది ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేసేవారని తెలిపారు.

12/26/2018 - 23:41

చిన్నగొట్టిగల్లు, డిసెంబర్ 26: భాకరాపేట అటవీప్రాంతంలో మంగళవారం రాత్రి నిర్వహించిన కూంబింగ్‌లో యర్రావారి పాళ్యెం మండలం, మట్టివారి పల్లెకు చెందిన షేక్ రియాజ్ బాషాను అరెస్టు చేశామని, పారిపోయిన మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని భాకరాపేట అటవీ రేంజ్ ఆఫీసర్ కె.రఘునాథ్ చెప్పారు.

12/26/2018 - 22:20

చెనే్నకొత్తపల్లి, డిసెంబర్ 26 : బొలెరో వాహనం బోల్తాపడి ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయిన సంఘటన మండల పరిధిలోని గొల్లవాండ్లపల్లి గ్రామం వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నామాల గ్రామానికి చెందిన గాండ్ల మల్లికార్జున (34)కు బోరుబావుల మోటార్ల మరమ్మతు వాహనం వుంది. అయితే పని ముగించుకుని వెళుతుండగా గొల్లవాండ్లపల్లి గ్రామ బస్టాండ్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

12/26/2018 - 22:19

మడకశిర, డిసెంబర్ 26 : పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో శ్రీనివాసులు (38) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతపురం పట్టణంలోని వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు రెండు రోజుల క్రితం బేల్దార్ పని నిమిత్తం మడకశిరకు వచ్చినట్లు ఎస్సై గోపీ తెలిపారు. అయితే బుధవారం తెల్లవారుఝామున రహదారి దాటేందుకు ప్రయత్నించగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.

12/26/2018 - 22:18

పెద్దవడుగూరు, డిసెంబర్ 26 : మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామం వద్ద బుధవారం నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంబాన్ని ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జిల్లాకేంద్రంలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షకు చిత్తూరు గ్రామస్థులను తరలిస్తున్న ఆర్టీసీ బస్సు దిమ్మగుడి గ్రామం వద్ద మలుపులో విద్యుత్ స్తంబాన్ని ఢీకొంది.

12/26/2018 - 22:09

నరసరావుపేట, డిసెంబర్ 26: నరసరావుపేట నుండి గొర్రెలతో సత్తెనపల్లి వెళుతున్న సమయంలో బుధవారం తెల్లవారుఝామున మండలంలోని ములకలూరు గ్రామం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఇసుకలోడులో వస్తున్న లారీ గొర్రెలను ఢీకొనడంతో 24గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, 11 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన మల్లా నాగరాజు గోర్రెలను మేపుకుని జీవనం సాగిస్తున్నాడు.

Pages