-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మధిర, డిసెంబర్ 26: మధిర పట్టణంలోని సుందరయ్యనగర్లో ఒకే అపార్ట్మెంట్లో 3ప్లాట్లలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏఆర్ అపార్ట్మెంట్లోని గింజుపల్లి పుల్లారావు, మాచవరపు చలపతిరావు, కొమ్మినేని విద్యాసాగర్లు ఉంటున్నారు. వీరు రెండురోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్ళారు.
బలిజిపేట, డిసెంబర్ 26: మండలంలోని పెదపెంకి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాడంగి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన చప్ప శంకరరావు తుమరాడ గ్రామానికి బైక్పై వస్తుండగా బలిజిపేట నుంచి పెదపెంకి వైపు బైక్పై ఎదురుగా వస్తున్న కాగాన రమేష్, పెంకి అశోక్లు గీతామందిరం సమీపంలో ఢీకొన్నారు.
పలాస, డిసెంబర్ 26: కాశీబుగ్గ ఎల్సి గేటు సమీపంలో పలాస రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో మందస మండలం, బొగాబంద గ్రామానికి చెందిన నర్శింహులు(30) అనే యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు జి ఆర్ పి ఎస్ ఐ రవికుమార్ తెలిపారు. జి ఆర్పి పోలీసుల కథనం మేరకు బొగాబందకు చెందిన దండాసి,వరలక్ష్మిలకు చెందిన పెద్దకుమారుడు నర్శింహులు గతంలో ఆటో నడిపేవాడు.
కురిచేడు, డిసెంబర్ 25: ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన కురిచేడులో మంగళవారం ఉదయం ఓ ఉపాధ్యాయ సంఘం నేత షేక్ ఖాజారహంతుల్లాను స్థానిక పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం ఎస్సై బి ఫణిభూషణ్ ఆధ్వర్యంలో ఆ ఉపాధ్యాయుడిని తహశీల్దార్ కార్యాలయంలో విచారణ నిమిత్తం కందుకూరు ఆర్డీఓ కెఎస్ రామారావు ఎదుట హాజరుపరిచారు.
హైదరాబాద్, డిసెంబర్ 25: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు యువకుల మథ్య జరిగిన స్వల్ప ఘర్షణ కత్తిపోట్లకు దారితీసి ఓ యువకుడిని స్నేహితులే దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక్కడి ఖాజా పహాడీ నంజాన్ కాలనీ ప్రాంతంలో గుర్రపు దొడ్డి ఉంది.
విజయవాడ(సిటీ), డిసెంబర్ 25: కులాలను, మతాలను అగౌరవపరిచే రీతిలో సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
ఖైరతాబాద్, డిసెంబర్ 25: లకీకాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో సంతోష్నగర్కు చెందిన వ్యక్తులు సోమవారం రాత్రి విధ్వంసం సృష్టించారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి చెందిందని ఆరోపిస్తూ పెద్దగా కేకలు వేస్తూ అద్దాలను పగుల గొట్టారు. అడ్డువచ్చిన సెక్యూరిటీ గార్డులను, సిబ్బందిపై విరుచుకుపడ్డారు. రెసెప్షెన్లో ఉన్న కంప్యూటర్లను, ప్రింటర్లను విసిరి పారేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్, డిసెంబర్ 25: పాతబస్తీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్ పరిధిలోని ఫత్తేదర్వాజా ప్రాంతంలో భూ వివాదం కాల్పులకు దారి తీసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య మూడు అడుగుల స్థలం విషయమై గొడవ తలెత్తిన నేపథ్యంలో తాబిక్ మిన్ మహఫూజ్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
జీడిమెట్ల, డిసెంబర్ 25: నలుగురు భూకబ్జాదారులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. గాజులరామారం డివిజన్ కైసర్నగర్, కట్టమైసమ్మ బస్తీల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి అమాయకులకు విక్రయించిన నలుగురిపై కుత్బుల్లాపూర్ మండల తహశీల్దార్ గౌతమ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత మూడు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు.
ఘట్కేసర్, డిసెంబర్ 25: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన నలుగురిని చేసి రిమాండ్కు తరలించినట్లు ఘట్కేసర్ క్రైం ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ తెలిపారు.