-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విశాఖపట్నం, అరుకు, అక్టోబర్ 1: విశాఖ ఏజెన్సీలో లివిటిపుట్టు గ్రామంలో గత ఆదివారం జరిగిన జంట హత్య కేసును చేధించేందుకు సిట్ అధికారులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దర్యాప్తులో కొన్ని భయంకర నిజాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. కిడారిని హతమార్చడం వెనుక ఆయన రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందన్న దిశగా పోలీసులు విస్తృత దర్యాప్తు జరుపుతున్నారు. మరోపక్క ఈ జంట హత్యల ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది.
నల్లజర్ల, అక్టోబర్ 1: అనారోగ్యం పాలైన భర్త తనకు కొద్ది రోజుల్లో దూరమవుతాడని తెలిసి, తట్టుకోలేని భార్య అతనితో కలిసి పురుగుల మందు సేవించి, బావిలో దూకి ప్రాణాలు విడిచింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతునీడిపాలెంలో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో వచ్చే డిసెంబరులోగా హైకోర్టు భవన నిర్మాణం పూర్తి చేస్తామని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలోనే ఏర్పాటు చేయాలంటూ 2015లో ధన్గోపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్పై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ కేంద్రం సుప్రీం కోర్టులో స్పెషల్ లీల్ పిటిషన్ను దాఖలు చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: కోరెగావ్-్భమా అల్లర్ల కేసులో అరెస్టయి గృహ నిర్మంధంలో ఉన్న ఐదుగురు పౌరహక్కుల నేతల్లో ఒకరైన గౌతమ్ నవలఖాను గృహనిర్బంధం నుంచి విడుదల చేయడానికి ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. తనను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని, కింది కోర్టు తనపై విధించిన ట్రాన్సిట్ రిమాండ్ను రద్దు చేయాలని గౌతమ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
బాలానగర్, అక్టోబర్ 1: ఇద్దరు బాలురు అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్లో చోటు చేసుకుంది. సిఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్కి చెందిన తర్కేవ్వర్ పాండే బాలానగర్ రంగారెడ్డి నగర్లో నివాసముంటూ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు రవిరాజన్ (12) స్థానిక రెయిన్ బో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు.
నెక్కొండ,అక్టోబర్ 1: అకాల వర్షం ఆ రెండు కుటుంబాలను ఆగం చేసింది. సోమవారం సాయం త్రం కురిసిన భారీ వర్షానికి తోడు పిడుగుపడటంతో నెక్కొండ మండలం అమీన్పేట, సూరిపెల్లి గ్రామా ల్లో భారీ నష్టం చోటుచేసుకుంది. అమీన్పేటలో చిలపూరి వెంకన్నకు చెందిన 35 మేకలు, గొర్రెలు పిడుగుపాటుతో మృత్యువాతపడ్డాయి.
బాల్కొండ, అక్టోబర్ 1: ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి ట్రాన్స్ఫార్మర్ చోరీ జరిగింది. గ్రామ శివార్లలోని రెండు ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ధ్వంసం చేసి, అందులో ఉండే రాగి తీగలతో పాటు ఆయిల్ను దుండగులు తస్కరించుకెళ్లారని విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎల్లారెడ్డి, అక్టోబర్ 1: ఇంట్లో అద్దెకు చేరి ... ఇంటి యజమానులైన వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి, ఇంట్లోని నగదు, బంగారం దోచుకెళ్లిన సంఘటనతోపాటు, ఇంటి యజమాని కళ్యాణి శంకర్ (70) అనుమానాస్పద స్థితిలోమృతి చెందిన సంఘటన, ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని బీసీ కాలనీలోచోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై ఉపేందర్రెడ్డి కథనం ప్రకారం..
సదాశివపేట, అక్టోబర్ 1: జనసంచారం లేని సమయం చూసి ఏటీఎంలో చోరీకి నింధితుడు విఫలయత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని నందికంది గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సదాశివపేట ఇన్స్పెక్టర్ కేతిరెడ్డి సురేందర్రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్తు తెలియని దుండగుడు ముఖాని జేబురుమాలు కట్టుకుని 65వ జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటు చేసిన ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలోకి చొరబడ్డాడు.
ఏ కొండూరు : మండలంలోని పోలిశెట్టిపాడు దళితవాడకు చెందిన వాసం వాసు(13), వాసం దిలీప్(18) ఆదివారం సాయంత్రం ఎర్రచెరువులో ఈతకు వెళ్లి నీటమునిగి మృతి చెందారు. గ్రామానికి చెందిన వాసం శ్రీను - నాగమణి కుమారుడు వాసు, వాసం ఆనందరావు - కనకరత్నం కుమారుడు దిలీప్ ఆదివారం పాఠశాల, కళాశాలకు సెలవు కావడంతో సాయంకాలం సరదాగా ఈత కొట్టేందుకు ఎర్రచెరువులో దిగాయి. అయితే లోతైన గోతిలో పడి వారు మృతి చెందారు.