S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చాలాకాలం క్రిందట టాలీవుడ్లో మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది బాలీవుడ్ అందాల భామ నేహాశర్మ. ఆ సినిమా తరువాత ఒకటి రెండు చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇక్కడ పెద్దగా కలిసిరాలేదు. దాంతో బాలీవుడ్లోనే ప్రయత్నాలు సాగించింది. అక్కడా పెద్దగా చెప్పుకునే సినిమాలు చేయలేదు. దానికితోడు చేసిన సినిమాలన్నీ పరాజయం పాలవ్వడంతో పాపం నేహాకు అవకాశాలు తగ్గాయి.
ఎకె 9 స్టూడియోస్ సమర్పణలో అజయ్ కౌండిన్య, సంధ్య, అనూష హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్హెచ్ 47లో భూత్బంగ్లా’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. టిఆర్ఎస్ నేత ఠాగూర్ బాలాజీసింగ్, బిజెపి లీడర్ ఆంజనేయులు అతిథులుగా పాల్గొని పాటలను విడుదల చేశారు. అనంతరం బాలాజీసింగ్ మాట్లాడుతూ- సినిమా చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు.
వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై నూతన నటీనటులు శ్రీకాంత్, హేమలత (బుజ్జి) హీరోహీరోయిన్లుగా నాటితరం హీరోయిన్ సుహాసిని, సుమన్, భానుచందర్ ముఖ్యపాత్రలలో వి.ఎస్. ఫణీంద్ర దర్శకత్వంలో హేమలతారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నినే్నచూస్తు’. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. శరవేగంగా రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
కార్తీక్రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా వింగ్స్ మూవీ మేకర్స్ పతాకంపై పూర్ణానంద్ దర్శకత్వంలో ప్రతిమ.జి నిర్మిస్తున్న చిత్రం ‘దీర్ఘాయుష్మాన్భవ’. ఈ చిత్ర పోస్టర్ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కార్తీక్రాజ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైటిల్ ఆసక్తిగా వుంది. తప్పకుండా మంచి విజయం అందుకోవాలి అన్నారు.
టాలీవుడ్లో ప్రస్తుతం అందరికంటే స్పీడ్గా సక్సెస్లతో దూసుకుపోతున్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అందరూ నాని అని చెప్పేస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరో చేస్తోన్న సినిమా లుచాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. అందుకే నిర్మాతలు, దర్శకులు నాని కాల్షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ వెయిటింగ్ లిస్ట్లో ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ కూడా ఉన్నారట.
నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రాన్ ఫరింజా, సంయుక్తా హెగ్డే ముఖ్యపాత్రల్లో శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం ‘కిరాక్ పార్టీ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ హైదరాబాద్లో విడుదలైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు తేజ టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ- టీజర్ మళ్లీ మళ్లీ చూడాలన్పించేలా వుంది. నిఖిల్ నాచురల్గా నటించాడు.
రాహుల్ రవీంద్రన్ చాందిని చౌదరి, మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో ఇ.ఎం.వి స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కిన హౌరాబ్రిడ్జి చిత్రంలోని పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నారారోహిత్ సీడీని ఆవిష్కరించి తొలి కాపీని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నారారోసిత్, నిఖిల్, ఆర్.కె.గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హీరో నాని సమర్పణలో వాల్పోస్టర్ సినిమా పతాకంపై కాజల్, రెజీనా, ఇషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది.
మాస్ మహారాజాగా టాలీవుడ్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న రవితేజ ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. రవితేజ సినిమా అంటే సదరు ప్రేక్షకుడికి సందడిలా వుంటుంది. అందుకే ఆయనకు అభిమానులు కూడా ఎక్కువే. రవితేజ ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ చిత్రంతో ముందుకు వస్తున్నాడు.
సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 9న సిద్ధమైన సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ చెప్పిన విశేషాలు...