ఆంధ్రప్రదేశ్
22 నుంచి అనంతలో వరుణ యాగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 14 May 2017
రాయదుర్గం రూరల్, మే 13: అనంతపురం జిల్లాలో గత 20 ఏళ్ల నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున వరుణుడి కరుణ కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాయదుర్గంలో పెద్దఎత్తున వరుణయాగం నిర్వహించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శనివారం రాయదుర్గంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు పట్టణంలోని శ్రీ జంబుకేశ్వరస్వామి ఆలయంలో యాగం నిర్వహించనున్నామన్నారు. గత 17 ఏళ్లుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఫలితంగా భూగర్భజలాలు అడుగంటాయన్నారు.