Others

తరుణి... తడబాటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా భారతావనిలో తరుణీ అడుగులు తడబడుతూనే ఉన్నాయి. వివిధ రంగాల్లో ఆమెకు దక్కాల్సిన స్థానం దక్కటం లేదు. కారణాలు ఎన్నైనా విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగాల్లో అతివల భాగస్వామ్యం ఇంకా అనుకున్నంత పురోగతి సాధించలేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వివరాలలోకి వెళితే...
దేశంలోని 24 హైకోర్టుల్లో ఎనిమిది చోట్ల ఇంత వరకు మహిళ జడ్జినే నియమించబడలేదు. కార్పొరేట్ సెక్టార్‌లో మహిళా న్యాయవాదుల డిమాండ్ అధికంగా ఉన్నా అనుకున్నంత మేరకు నియమించటం లేదు. అలాగే లా కోర్సుల్లో మహిళా ఎన్‌రోల్‌మెంట్ 61శాతానికి పెరిగింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అతివల ప్రాతినిధ్యం ఈనాటికీ నామమాత్రంగానే మిగిలింది. 2016నాటికి 24మంది జడ్జీలు ఉండగా.. ఓకేఒక మహిళా జడ్జీ ఉన్నారు. ఆమె భానుమతి. ఈమె 1981 నుంచి లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలలో సైతం న్యాయస్థానాలలో నారీమణుల సంఖ్య తక్కువగానే ఉంది. వివిధ హైకోర్టులలో 652మంది జడ్జీలు ఉండగా ఇందులో మహిళా జడ్జీల సంఖ్య 69 మాత్రమే.
ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, ముంబయిలలో మాత్రమే మహిళా జడ్జీలు ఎక్కువ మంది ఉన్నారు.
ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం కొంతమేరకు పురోగతి సాధించిందని చెప్పవచ్చు. 56శాతం నుంచి 66శాతానికి పెరిగింది. రాష్ట్రాలలో 8శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఎంపికయ్యారు. హర్యానా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహారులలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య అధికంగా ఉంది.
ప్రభుత్వ సర్వీసుల విషయానికి వస్తే.. గ్రూప్ ఏలో 30% ఉంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 20%, ఇండియన్ అకౌంట్స్ విభాగంలో 24%, పోస్టల్ సర్వీసులో 21%, విదేశీ వ్యవహారాల శాఖలో 19%, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసులో 15%, అడ్మినిస్ట్రేటివ్‌లో 14%, ఇండియన్ ట్రేడ్ సర్వీసులో 12% భాగస్వామ్యం మాత్రమే ఉంది.