రాష్ట్రీయం

అవే డ్రగ్సేమో.. స్పష్టంగా తెలీదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: ‘డ్రగ్స్ గురించి నాకు తెలీదు. షూటింగ్ విరామం, పేకప్ తరువాత కొందరు డ్రిక్స్ తీసుకునేవారు. అందులో మత్తు పదార్థాలు మిళితమై ఉండేవేమో.. స్పష్టంగా తెలీదు’ అంటూ విచారణలో సినీ నటి చార్మి వాంగ్మూలమిచ్చినట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో బుధవారం హీరోయిన్ చార్మికౌర్‌ను సిట్ బృందం విచారించింది. కోర్టు ఆదేశాలమేర ఉదయం 10:30కు మొదలైన విచారణ సాయంత్రం 4:45కు ముగించింది సిట్ బృందం. నలుగురు మహిళా అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక బృందం ఆరున్నర గంటలపాటు సాగించిన విచారణలో చార్మి ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు సమాచారం. డ్రగ్స్ కింగ్ కెల్విన్‌తో సంబంధాలపైనే సిట్ ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. డ్రగ్స్‌గురించి తెలీదంటూనే, షూటింగ్ విరామం, పేకప్ టైంలో కొందరు డ్రింక్స్ తాగేవారని, అందులో ఎలాంటి పదార్థాలు మిళిమితమై ఉండేవో మాత్రం తనకు తెలీదని చార్మి వెల్లడించినట్టు సమాచారం. కెల్విన్ సెల్‌ఫోన్‌లో ఉన్న నెంబర్లు, వాట్సాప్ సందేశాల ఆధారంగానే ఆమెను విచారించి కీలక సమాచారం రాబట్టినట్టు చెబుతున్నారు. కెల్విన్ సెల్‌ఫోన్, వాట్సాప్ సంభాషణలో చార్మి, కెల్విన్‌ను దాదా (అన్న) అని సంబోధించినట్టు చెబుతున్నారు. దీంతో నటి చార్మి, కెల్విన్ మధ్య డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్టు సిట్ ధ్రువీకరించుకుంది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చార్మికి సిట్ అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. సినీ పరిశ్రమలో డ్రగ్స్ దందా గురించి తెలియదు. కానీ, డ్రగ్స్ క్రయ విక్రయాలు ఉండొచ్చని సిట్ అధికారులకు చార్మి చెప్పినట్టు సమాచారం.
శాంపిల్స్‌కు నిరాకరణ
చార్మి తన వెంట్రుకలు, గోళ్లు, రక్త నమూనాలను ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమెనుంచి ఎలాంటి శాంపిల్స్ తీసుకోలేదని సిట్ బృందం చెబుతోంది. ఈనెల 19న ప్రారంభమైన విచారణలో పూరి జగన్నాథ్, సుబ్బరాజు, శ్యాం కె నాయుడు, తరుణ్, నవదీప్, చిన్నాలను విచారించామని, బుధవారం నటి చార్మితోపాటు వ్యాపార వేత్తలు సచిన్ ధావన్, సల్మాన్‌లనూ విచారించామని సిట్ పేర్కొంది.