మోహన్బాబు గాయత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 30 July 2017
ప్రముఖ సీనియర్ నటుడు మోహన్బాబు రెండేళ్ళ గ్యాప్ తరువాత మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయత్రి’. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 2015లో మామ మంచు అల్లుడు కంచు సినిమాలో నటించిన మోహన్బాబు, ఆ తరువాత ఏ చిత్రంలోనూ కనిపించలేదు. తాజాగా తెరకెక్కే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనసూయ కూడా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానుంది.