మోహన్‌బాబు గాయత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సీనియర్ నటుడు మోహన్‌బాబు రెండేళ్ళ గ్యాప్ తరువాత మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయత్రి’. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 2015లో మామ మంచు అల్లుడు కంచు సినిమాలో నటించిన మోహన్‌బాబు, ఆ తరువాత ఏ చిత్రంలోనూ కనిపించలేదు. తాజాగా తెరకెక్కే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనసూయ కూడా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానుంది.