ఉన్నది ఒకటే జిందగీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పి.ఆర్.సినిమా, స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ- స్నేహం ప్రేమ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా విడుదల చేస్తున్నాం. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ పాటను చంద్రబోస్ వ్రాశారు. ఇప్పటికే 50 శాతంపైగా షూటింగ్ పూర్తయింది. ఈనెల 7 నుంచి ఊటీలో మరో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నాం. దాంతో ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తవుతుంది. ఆ పాటను వచ్చే నెలలో ఇటలీలో చిత్రీకరించి దసరాకు చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్:ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్:శ్రీకర్ ప్రసాద్, కెమెరా:సమీర్‌రెడ్డి, నిర్మాతలు:కృష్ణ చైతన్య, స్రవంతి రవికిశోర్, దర్శకత్వం:కిశోర్ తిరుమల.