ఆంధ్రప్రదేశ్
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సీలేరు, డిసెంబర్ 10: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో కిలో సీతారామ్ (45) అనే గిరిజనుడిని శనివారం అర్ధరాత్రి కాల్చి చంపారు. మల్కన్గిరి జిల్లా రాళ్లగడ్డ పంచాయతీ పెద్ద టేకుపొదర్ గ్రామానికి చెందిన సీతారామ్ కొంత కాలంగా పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని, పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయిందని మావోయిస్టులు పేర్కొన్నారు. దీంతో ప్రజాకోర్టు నిర్వహించి సీతారామ్ను హతమార్చామని, పోలీసులకు ఎవరైనా తొత్తులుగా వ్యవహరిస్తే సీతారామ్కు పట్టిన గతే పడుతుందని పెద్దగూడ గ్రామస్తులను మావోయిస్టులు హెచ్చరించారు. జి.మాడుగులలో పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో ఇద్దరు గిరిజనులను హతమార్చి 24 గంటలు గడవక ముందే మరొక గిరిజనుడిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేయడంతో పోలీసుల్లో తీవ్ర కలకలం రేపింది.