రాష్ట్రీయం

మహిళలను మోసం చేసిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంబులపూలకుంట, డిసెంబర్ 26: రాష్ట్రంలోని అన్నివర్గాల మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దారుణంగా మోసం చేశారని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్ర 44వ రోజు మంగళవారం అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ధనియాన్‌చెరువులో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పలువురు మహిళలు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న జగన్ ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదన్నారు. మాఫీ సంగతి మరవడమేగాక కొత్త రుణాలు కూడా ఇవ్వడం మానేశారన్నారు. పొదుపు సంఘాల తరపున బ్యాంక్‌కు కట్టాల్సిన డబ్బు కట్టకుండా మోసం చేశారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో అమ్మాయిలు ఉన్నత చదువులకు దూరమయ్యారన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల మహిళలకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ మొత్తం చెల్లిస్తామన్నారు. రాష్ట్రం బయట చదువుకుంటున్న వారికి రూ.20 వేలు ఇస్తామన్నారు. అవ్వాతాతల పింఛన్ వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. పేదలందరికీ పక్కాగృహాలు కట్టించడమేగాక వాటిని అక్కాచెల్లెళ్ల పేర రిజస్టర్ చేయిస్తామన్నారు. అధికారంలోకి రాగానే మహిళల సమస్యలన్నీ పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడారు.