ఆంధ్రప్రదేశ్‌

కమీషన్లు కుదరకే పోలవరం పనుల్లో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, జనవరి 2: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యయం అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారని, ఫలితంగా ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయలేక పోతున్నారని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నేటికి పోలవరం పూర్తయ్యేదన్నారు. బీజేపీ, టిడీపీ ప్రభుత్వాల మధ్య కమీషన్లు కుదరకనే పోలవరం పనులు నిలిచిపోతున్నాయన్నారు. తొలుత 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేడు 2019లోగా పూర్తి చేస్తామని దొంగనాటకాలు అడుతున్నారని ఆరోపించారు. పోలవరం పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిపోతుందని తాము మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వేగం పెంచాలని కోరుతూ ఈనెల 7, 8, 9 తేదీల్లో ధవళేళ్వరం నుంచి పోలవరం వరకు కాం గ్రెస్ పార్టీ అధ్యర్వంలో పాదయాత్ర చేపడుతున్నట్లు రఘువీరా తెలిపారు. 10న సామూహిక నిరసన కార్యక్రమం చేపడుతామన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.