ఎన్టీఆర్ సరసన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జైలవకుశ తరువాత ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం వచ్చే నెలనుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అనే్వషణ సాగుతోంది. ఇప్పటికే అను ఇమ్మాన్యుయేల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం అను ప్లేస్లో పూజా హెగ్డే నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ కాంబినేషన్ పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా విజయం అనుకున్న రేంజ్లో లేకపోవడంతో హీరోయిన్ను మార్చాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ నేపథ్యంలో ఇటీవల డిజె సినిమాతో గ్లామర్ హీరోయిన్గా సంచలనం రేపిన పూజా హెగ్డేను ఓకె చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా బెల్లంకొండ శ్రీనివాస్తో సాక్ష్యం చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు రామ్చరణ్-సుకుమార్ల రంగస్థలంలో ప్రత్యేక పాటలో నర్తిస్తోంది. మొత్తానికి వరుస అవకాశాలతో జోరుమీదున్న పూజ, టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారడం ఖాయమని అంటున్నాయి టి వర్గాలు.